హైందవ సంప్రదాయం ప్రకారం దేవాలయాల్లో ఆగమాల ప్రకారం దైవానికి పూజలు నిర్వహి స్తారు.అయితే ఇక్కడ మాత్రం చిత్రంగా ఆలయం, దేవుడు అనే ప్రత్యేక విధానాలు ఏమీ కనిపం చవు. భగవంతుడి అవధూతగా భావించే వీరుడు తాత గ్రామ దైవానికి భక్తులు వైవిధ్యంగా రాళ్లను నైవేద్యంగా అర్పిస్తారు. భక్తులు వీరుడు తాతకు పెట్టే నైవేద్యాన్ని చూస్తే మీకు తప్పకుండా ఆశ్చర్య కలుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.స్థానికలు స్టోన్ గాడ్ గా వ్యవహరించే వీరుడి తాతపై ప్రత్యేక కథనం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం షేర్ మహమ్మద్ పురం అనే గ్రామంలో విక్షణ ఆచారం ప్రజలను ఆశ్చర్యచకితు లను చేస్తోంది. ఈ గ్రామం పేరు చూడడానికి ముస్లీం శైలి కనిపిస్తున్నప్పటికీ తొంబై శాతం ప్రజలు ఇక్కడ హిందువులే ఉన్నారు. ఈ గ్రామంలో మరో ప్రత్యేకత ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ శివార్లలోని ఓ చోట కొలువై ఉన్న వీరుడు తాతగా పిలిచే గ్రామ దైవానికి ఇక్కడి ప్రజలు రాళ్ళను నైవేద్యంగా పెట్టి కొలుస్తూ ఉంటారు. ఇక్కడ ఆలయ గోపురాలు, గర్భాలయం ఏమీ ఉండవు. ఆరుబయట రహదారి ప్రక్కనే రాళ్లగుట్టలా కనిపిస్తున్నదే వీరుడి తాత సన్నిధి.ఈ మార్గంలో వెళ్లే భక్తులు వీరుడు తాతకు రాళ్లను నైవేద్యంగా సమర్పించి, కైమోడ్పులు అర్పిస్తారు.
గ్రామం శివారులో కొలువైన వీరుడితాత శెట్టి బలిజల కుల దైవంగా చెబుతారు. గ్రామ శివార్లలో ఉన్న వేప చెట్టే, వీరుడి తాతను కొలిచే స్థానం. వేపచెట్టు సన్నిధిలో నిత్యం పూజలు చేస్తారు. శెట్టి బలిజ కుల స్థుల వివాహాలు కూడా నేటికీ ఈ వీరుడి తాత సన్నిధిలోనే జరుగుతాయి. అలాంటి వీరుడి తాతను కొలిచే ముందు ఆయనపై ఒక రాయిని వెయ్యడం ఇక్కడ కొన్ని వందల ఏళ్ల నుంచి ఆచారంగా కనిపిస్తోంది. ఇదే ఆచారాన్ని ఎస్.ఎం పురం గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతీయులు కూడా పాటిస్తూ ఉండటంతో ఓ వింత ఆచారానికి వేదికగా మారింది. ఈ గ్రామం నుండి ఎవరు బయట ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, వీరుడి తాత స్థానం వద్ద ఆగి ఒక రాయిని వేసి వీరుడితాతను మొక్కుకుంటారు. రాళ్లను నైవేద్యంగా అర్పిస్తే మనసులో కోర్కెలు తీరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. వెళ్ళిన
వీరుడి తాత సన్నిధిలో రెండు సెంట్ల స్థలాన్ని పూజల కోసం కేటాయించారు. శెట్టి బలిజ కులస్థుల వివాహాలు ఇక్కడ జరిగే సమయంలో రాళ్ళ చుట్టూ కాస్త పరిశుభ్ర పరిచి సన్నాహక ఉత్సవాలను జరుపు తారు. వేరే చోట నుండి తెచ్చిన రాళ్ళనే గుట్టపైకి వెయ్యాలని నియమం ఉంది. గుట్టలో రాళ్ళను మళ్ళీ తీస్తే కీడు సంబవిస్తుందని కూడా ఇక్కడివారు విశ్వసిస్తారు. మొత్తానికి వింతైన ఆచారంతో షేర్ మహ్మద్ పురం, ఎస్.ఎం.పురం గ్రామాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. ఈ వింతను చూసిన వారంతా.. రాళ్ళను దేవుడి పై వెయ్యడం ఏమిటా అంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు .