Gold Robbery | హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో జరిగిన దొంగతనాన్ని గుట్టురట్టు చేశారు పోలీసులు. ఎస్ఆర్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో రూ.50 లక్షల బంగారం చోరీ కేసులో పనిమనుషులను అరెస్ట్ చేశారు పోలీసులు. ముంబై కి చెక్కేసిన వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏప్రిల్ మూడో తేదీన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్ మెంట్ లో ఇద్దరు మహిళా పనిమనుషులు బంగారం దొంగతనం చేసి చెక్కేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. చివరకు ముంబైలో వీరిని గుర్తించి పట్టుకున్నారు. మహిళల వద్దనుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.