ఐపీఎల్ లో మరో మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం రెడీ అయింది. సాయంత్ర 7.30గంటలకు ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు వచ్చిన ముంబై జట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్ ను మ్యాచుకు ఆహ్వానించాడు.
‘మేం వచ్చేసినాం.. MI ఫ్యాన్స్ పదండి ఉప్పల్’కు అంటూ తెలుగులో మాట్లాడాడు. ఈ వీడియోను ముంబై ప్రాంఛైజీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రోహిత్ తల్లి పూర్ణిమ స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం కాగా.. మహారాష్ట్రకి చెందిన గురునాథ్ శర్మను ప్రేమ వివాహం చేసుకుని ముంబైలో స్థిరపడ్డారు. దీంతో రోహిత్ తెలుగులో మాట్లాడగలడు.
Captain Ro Hyderabad వచ్చెసాడు! 💙#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 pic.twitter.com/LbDgfbrV19
— Mumbai Indians (@mipaltan) April 17, 2023