38.2 C
Hyderabad
Sunday, May 3, 2026
spot_img

ఏడు గంటలుగా కేజ్రీవాల్ విచారణ… రేపు ఆప్ అత్యవసర భేటీ

Delhi Liquor scam case | లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణ కొనసాగుతుంది. దాదాపు ఏడు గంటలుగా కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ.. ఇంకా కొనసాగుతోంది. లిక్కర్ స్కాంలో పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, ఇందులో సీఎం కేజ్రీవాల్ పాత్ర ఎంతుంది, కమీషన్ రేట్లను పెంచడం లాంటి విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు. రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియాతో పాటుగా గ్రూప్ ఆప్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి కేజ్రీవాల్ ఆమోదం తెలపడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కేజ్రీవాల్‌పై సీబీఐ విచారణ నేపథ్యంలో ఆప్ అత్యవసర భేటీ నిర్వహించనుంది. రేపు ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర సమావేశం కానుంది.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్