వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)పై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే(Faggan Singh Kulast) సెన్సషనల్ కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదని ఆయన వెల్లడించారు. నేడు విశాఖకు విచ్చేసిన ఆయన… విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… స్టీల్ ప్లాంట్లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని అన్నారు. స్టీల్ ప్లాంట్ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని… ముడిసరకు పెంపొందించే విషయంపై దృష్టి పెట్టామని అన్నారు. ఇందుకోసం ఆర్ఐఎన్ఎల్ అధికారులతో సమావేశం అవుతున్నామని అన్నారు. అయితే తెలంగాణ సర్కారు బిడ్డింగ్లో పాల్గొనడం వారి పరిధిలోని విషయమని మంత్రి తేల్చి చెప్పారు.
Read Also: భాగ్యనగరం నడి బొడ్డున 125 అడుగుల భారీ విగ్రహం.. రేపే ఆవిష్కరణ
Follow us on: Youtube, Koo, Google News