కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందడం కొత్త చర్చకు దారితీసింది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఆమెతో పాటు వెళ్లి, అనంతరం ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క కేసులో కీలక లింక్గా మారింది. కుక్క కదలికల ఆధారంగా చిన్నారి ఆచూకీపై ఏదైనా సమాచారం లభిస్తుందనే ఆశతో పలు కోణాల్లో పరిశీలనలు జరిగాయి. అయితే కేసు ఇంకా మిస్టరీగానే ఉన్న సమయంలో కుక్క మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఎనిమిది రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా, కీలకంగా భావించిన ఈ ఆధారం కూడా లేకపోవడం దర్యాప్తుకు మరింత సవాలుగా మారింది. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కుక్క మృతి
0
47
Previous article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


