బాపట్ల జిల్లా చీరాల (మం) ఈపురుపాలెంలో ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో కత్తిపోట్ల కలకలం రేగింది. కళాశాల సిబ్బందిపై కుమారుడు జిలానితో కలసి.. కత్తులతో కాలేజి మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆర్థికలావాదేవీల విషయంలో కొంతకాలంగా సత్తార్ కు.. కమిటీ మెంబర్స్ మధ్య వివాదం నడుస్తోంది. కళాశాలలోకి ఒక్కసారిగా కత్తితో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కళాశాల కమిటీ మెంబర్ హుస్సేన్, ప్రిన్సిపల్ శేషయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికత్స పొందుతూ హుస్సేన్ మృతి చెందాడు.


