సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, తల్లి సావిత్రిబాయి తన ఇద్దరు కుమార్తెలు నిఖిత (13), నందిని (12)తో కలిసి దుస్తులు ఉతికేందుకు గ్రామంలోని బావి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ముగ్గురూ బావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు చిన్నారులు ఇలా ఒకేసారి మృతి చెందడంతో బోర్గి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. బావిలో పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి
Latest Articles
- Advertisement -


