25.3 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం

మాట తప్పడం… మడమ తిప్పడం… ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన… అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మార్చుతారని మండిపడ్డారు. ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని ఆక్షేపించారు. డిసెంబర్ 9 2023న రుణమాఫీ చేస్తామని చెప్పి… ఆగస్టు 15లోపు చేస్తామని మరోసారి చెప్పి దసరా వరకు చేశారన్నారు. నేటికీ 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందలేదన్నారు. రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే 10 వేలు డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే 15 వేలు అని ప్రచారం చేసి… వానాకాలం ఎగ్గొట్టారని ఆక్షేపించారు.

యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామని… మాట మార్చి జనవరి 26 అన్నారని తెలిపారు. ఇప్పుడు మరోసారి మార్చి 31 వరకు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే… దాన్ని ఎగ్గొట్టి రైతులకు భరోసా లేకుండా రేవంత్ చేశాడని విమర్శించారు. ఆసరా 4 వేలు, తులం బంగారం, మహిళలకి 2 వేల 500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలంటూ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్