31.2 C
Hyderabad
Thursday, March 13, 2025
spot_img

ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్

యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. స్వామి కైలాష్‌నంద్ గిరి అనుచరులు లారెన్ శనివారం రాత్రి 40 మంది సభ్యుల బృందంతో కలిసి ఆధ్యాత్మిక శిబిరానికి చేరుకున్నారు.

పీచ్‌-పసుపు సల్వార్ సూట్‌ .. చేతిపై రక్షాసూత్రం, మెడలో రుద్రాక్ష మాలతో వచ్చిన లారెన్‌కు ఆదివారం శిబిరంలో ఘనంగా స్వాగతం పలికారు. రిసెప్షన్‌లో ఆమెకు సాంప్రదాయ కుల్హాద్‌లో వేడి వేడి మసాలా టీ ఇచ్చారు.

లారెన్ జనవరి 15 వరకు నిరంజినీ అఖారా శిబిరంలో ఉంటారు. అనంతరం జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరిగి అమెరికా వెళ్తారు.

ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే ముందు ఆమె శనివారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు నిరంజనీ అఖారాకు చెందిన స్వామి కైలాసానంద గిరి మహారాజ్ కూడా ఉన్నారు.

సల్వార్ సూట్ , తలపై దుపట్టా ధరించి, లారెన్ ప్రధాన ఆలయ ప్రాంతం బయట నుండి ప్రార్థనలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, హిందువులు తప్ప మరెవరూ శివలింగాన్ని తాకకూడదని, అందుకే ఆమె గర్భగుడి వెలుపల నుండి ప్రార్థించారని స్వామి కైలాసానంద వివరించారు.

“నేను ఆచార్యుడిని, సంప్రదాయాలు, సూత్రాలు పాటించడం నా కర్తవ్యం” అని ఆయన వివరించారు.

“ఆమె నా కూతురు” అని స్వామి కైలాసానంద అన్నారు. ‘‘మా కుటుంబీకులంతా ‘అభిషేకం’లో పాల్గొని పూజలు చేశారు. ఆమెకు ప్రసాదం, పూలమాల వేశారు.. అయితే హిందువులు తప్ప మరెవ్వరూ కాశీవిశ్వనాథుడిని తాకకూడదనే సంప్రదాయాన్ని పాటించాలని అనుకున్నాం” అని చెప్పారు.

భారతీయ సంప్రదాయాలు , ఆధ్యాత్మికత పట్ల లారెన్‌కు ఉన్న ప్రగాఢమైన గౌరవం గురించి స్వామి కైలాసానంద వివరించారు. “ఆమెకు భక్తి ఎక్కవని చెప్పారు. “ఆమె మన సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆమె నన్ను తండ్రిగా , గురువుగా గౌరవిస్తుంది. ఆమె నుండి అందరూ నేర్చుకోవాలి. భారతీయ సంప్రదాయాలను ప్రపంచం గౌరవిస్తోంది.”.. అని చెప్పారు.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్