సీఎం చంద్రబాబు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. రేపల్లె నియోజకవర్గ YCP నేతలతో ఆయన భేటీ అయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, నియోజకవర్గంలోని పరిస్థితులపై వైసీపీ నేతలతో ఆయన చర్చించారు. మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడడం బాధాకరమని, ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదని చెప్పారు. మండలి రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు..పదవిపోకుండా రాజ్యసభకు కూడా పంపామని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేపల్లేలో గణేష్కు వైసీపీ నాయకుల మద్దతు అవసరం ఉందని జగన్ స్పష్టం చేశారు.
రేపల్లె నియోజకవర్గ YCP నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం
0
172
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


