రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య వాగ్వాదం

రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కించపరిచారంటూ జయాబచ్చన్‌పై.. ఛైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. అయితే జయాబచ్చన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా.. అదే స్థాయిలో మండి పడ్డారు. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఫలితంగా ఇద్దరి మధ్య ఒక్కసారిగా మాటలయుద్ధం మొదలైంది. తాను ఒక నటినని.. ఎవరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోగలనన్నారు. ఇలా గట్టిగా మాట్లాడడం సరికాదని.. మీరు ఛైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటేనని జయాబచ్చన్ అన్నారు. ఆమె వ్యాఖ్యలపై జగ్‌దీప్ ధన్‌కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దయచేసి కూర్చోండని మందలించారు. మీరు సెలెబ్రిటీ అయితే అయుండొచ్చని కానీ సభా మర్యాదలు పాటించాలని తేల్చి చెప్పారు.

Latest Articles

రూ. 2,000 అద్దె చెల్లించలేక.. భార్య, కూతురిపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒప్పందం

గుజరాత్‌లోని మోర్బీలో అమానుష ఘటన జరిగింది. అద్దె బకాయిలు చెల్లించలేకపోయిన ఓ వ్యక్తి, తన భార్యతో పాటు మైనర్ కుమార్తెపై ఇంటి యజమాని లైంగిక దాడి చేయడానికి ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలపై పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్