తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో హుండీని పగులగొట్టిన దుండగులు నగదును ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున దుండగులు అనుమానంగా సంచరిస్తుండడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల వద్ద నుంచి 31వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిపై సుమారు 10కేసులు ఉన్నాయని.. ప్రత్యేకంగా ఆలయాల్లో హుండీలను మాత్రమే దొంగలిస్తారని దర్యాప్తులో తేలినట్లు ఆయన చెప్పారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు
0
260
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


