ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ నెల 16వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. లేళ్ల అప్పిరెడ్డి, రఘురామ్, ఆర్కే, సజ్జల, దేవినేని అవినాష్కు ముందస్తు బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు నివాసంలో దాడి కేసులో.. జోగి రమేష్కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.