శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గొండు శంకర తెలిపారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రంథాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేదన్నారు. మున్సిపాలిటీ నుంచి రావాల్సిన గ్రంధాలయ పన్నులు సకాలంలో అందక సిబ్బందికి కూడా జీతాలు అందడం లేదని చెప్పారు. పంచాయతీ నిధులను గల్లంతు చేయడం వల్లనే గ్రంథాలయాలకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. గ్రంథా లయంలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, కంప్యూటర్లను సైతం రెండు రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తెస్తానని నిరుద్యోగులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
గ్రంథాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గొండు శంకర
0
232
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


