ఓ సామాన్య వ్యక్తి మోదీపై ఒకే ఒక్కడిగా పోరాడాడు. సోషల్ మీడియా వేదికగా ప్రచార ప్రభంజనాన్ని సృష్టించి 400ల లక్ష్యానికి గండి కొట్టాడు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను కోట్లాది మంది జనం గుండెకు చేరేలా నెట్టింట ఏకి పారేశాడు. ఇంతకీ ఎవరా ఒకే ఒక్కడు..?
దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ముగియడంతో అభ్యర్థులు, పార్టీలే కాదు. ప్రజలంతా గెలుపోట ములపై చర్చించు కుంటున్నారు. రాజకీయ పండితుల ద్వారా కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమం లోనే బీజేపీకి తగ్గిన సీట్లపై కూడా ముచ్చటిస్తున్నారు. ఇందుకు ధ్రువ్ రాథీ ప్రచారం ఓ కారణమని చెబుతున్నారు పొలిటికల్ ఎనలిస్గులు. అయితే మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీజేపీకి సీట్లు తగ్గించే పాత్ర పోషించాడు యూట్యూబర్ ధ్రువ్ రాథీ. వారి అంచనాలను తలకిందులు చేసి కమలనాథుల టార్గెట్ను గురి పెట్టాడు. అబ్ కి బార్ చార్ సౌ పార్ అన్న నినాదాన్ని తొక్కి పాడేశాడు.
ఎన్నికల ప్రచారం పర్వంలో సోషల్ మీడియాదే హవా. తాను చెప్పాలనుకున్నది ఏదైనా సరే నెట్టింట పోస్ట్ చేస్తే చాలు. అలా లోకమంతా చుట్టేస్తుంది. కోట్లాది జనాన్ని చేరుకుంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియానే నమ్ముకుం టున్నారు. ఇక మోదీని దెబ్బ కొట్టేందుకు, బీజేపీని ఖంగు తినిపించేం దుకు ధ్రువ్ రాథీ సోషల్ మీడియానే అస్త్రంగా మార్చుకున్నారు. హిందుత్వ నినాదాన్ని, మోదీ మత రాజకీయాన్ని ఏకి పారేసేందుకు సాధనంగా ఎంచుకున్నాడు. కోట్లాది మందికి చేరేలా బీజేపీకి వ్యతిరే కంగా ప్రచారాన్ని కొనసాగించాడు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించిన ధ్రువ్ సీఏఏ, నిరుద్యోగం, నోట్ల రద్దు, రైతు వ్యతిరేక చట్టాలు ఇలా ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియా వేదికగా పోరాటం చేశాడు ధ్రువ్. మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళన, జరిగిన హింస ఎవరూ మర్చిపోలేరు. అలాగే బ్లాక్ మనీ బయటకు రప్పిస్తానంటూ నోట్ల రద్దు నిర్ణయంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లు వెత్తాయి. ఇక సీఏఏ దుమారం రాజకీయ ప్రకంపనలు రేపింది. వీటన్నింటిని ప్రజల్లో ఎండగడుతూ తన పోరాటాన్ని, వ్యతిరేకతను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచాడు ధ్రువ్ రథీ.
ధ్రువ్ రాథీకి ఏ వెయ్యో, లక్షో కాదు. ఏకంగా 2 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారంటే ఆయన ప్రచారం ఏ రేంజ్లో జనం గుండెకు చేరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రచార ప్రభంజనాన్ని సృష్టిం చాడు. ‘మోడీ ది రియల్ స్టోరీ’ అనే కథనం 27 మిలియన్ల వీక్షణలను ఆకట్టుకుంది. ఇలా బీజేపీని దెబ్బ కొట్టడమే కంకణంగా పెట్టుకున్న ధ్రువ్ కమలనాథుల 400ల టార్గెట్ అంచనాలను తారుమారు చేసి అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యాడు. దీంతో ప్రతిపక్షాలే కాదు. బీజేపీని వ్యతికేంచే ప్రతీ ఒక్కరూ ధ్రువ్ రాథీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోపక్క ఒక సామాన్య వక్తే తమ కొంప ముంచ డానికి కారణమ య్యాడంటూ కమలనాథులు మండిపడుతున్నారు.
ఇంతకీ ధ్రువ్ రాతీ ఎవరు..? ఎందుకు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అన్నది తెలుసుకుంటే, మెకానికల్ ఇంజనీర్ అయిన రాథీ జర్మనీలో నివసిస్తున్నాడు. పలు అంశాలపై తనదైన స్టైల్లో కంటెంట్ని సృష్టిస్తూ యూట్యూబ్ కెరీర్ను ప్రారంభించాడు. అయితే కాలక్రమేణ అతడి దృష్టి రాజకీయాలపై మళ్లింది. అందు లోనూ మోదీ పాలనను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాక. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానా లను ప్రశ్నించేందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. అయితే, అతని వీడియోలు, ప్రభుత్వ విధానాలను తరచుగా విమర్శిస్తూ, సూటిగా నిలదీయంతోపాటు సామాజిక సమస్యలను హైలైట్ చేయడంతో మిలియన్ల వ్యూస్, కోట్లాది ఫ్యాన్స్ను సంపాదించాడు. ఇలా అతని సబ్స్క్రైబర్స్ కూడా పెరగడంతో పొలిటికల్ అంశాలపై మరింత ఫోకస్ పెట్టాడు ధ్రువ్. అక్రమ కేసులతో ప్రతిపక్షాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం, తనకు అనుకూలంగా మీడియాను మార్చేసుకోవడంతో ప్రజా గొంతుకగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టానని చెబుతుంటాడు ధ్రువ్ రథీ. అయితే ధృవ్ రాఠీ కథ కేవలం ఎన్నికలను ప్రభా వితం చేసిన యూట్యూబర్ మాత్రమే కాదు. సమాచార శక్తి అని జవాబుదారీతనం గల పౌరుడని ప్రశంస లు అందుకుంటున్నాడు.


