ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రెండు కోట్ల రూపాయలతో ఉడాయించిన సంఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో చోటుచేసుకుంది. ఇండియన్ ఎయిర్ పోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 50 మంది నిరుద్యోగుల వద్ద సంతోష్ అనే వ్యక్తి రెండు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. అనం తరం వారికి ఫేక్ హాల్ టికెట్లు, సర్టిఫికేట్లు ఇచ్చి పరార య్యాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితు లు పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసు లు సంతోష్ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.


