కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు. స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అంద జేశారు. శ్రీవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు అమిత్ షాకు వేదాశీర్వచనం అందిం చారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అమిత్ షా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కశ్మీర్ నుంచి తమిళనాడు వరకూ పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారం ముగియడంతో నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి వకుళామాత అతిథిగృహంలో బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించున్నారు. నేటి మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు
0
214
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


