హైదరాబాద్ నాంపల్లి లోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నీటిపారుదల శాఖకు చెందిన నలుగురు అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్ రూ.లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదే సమయంలో, లంచం డిమాండ్కు సంబంధించి కీలక అధికారి పరారీ కావడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగించారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు. వారిని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ వలలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ తో పాటు మరో ఇద్దరు ఏఈలు ఉన్నారు. నాలుగో వ్యక్తి కోసం రాత్రి నాలుగు గంటల పాటు శ్రమించి పట్టుకున్నారు.
నాంపల్లిలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
0
389
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


