ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో విమాన సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దించేసి, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్త మైన సిబ్బంది, ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం నుంచి ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలు దేరాల్సి ఉంది. అయితే, విమానా నికి బాంబ్ బెదిరింపు రావడంతో అలర్ట్ అయిన పైలట్ అత్యవసరంగా ఫ్లైట్ను ల్యాండ్ చేసి, ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులకు దించారు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్, సిబ్బంది కలిసి విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇక బెందిరింపు విషయం తెలియడంతో ప్రయాణికులు హడలిపోయారు. అయితే, ప్రయాణి కులంరూ సేఫ్ గా ఉన్నట్టు ఇండిగో సిబ్బంది స్పష్టం చేశారు.