హిందువులు పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. యాత్రలో మొదట సందర్శించే యము నోత్రికి భక్తులు పోటెత్తారు. రెండో రోజునే వేలాది మంది ఒక్కసారి యాత్ర చేయడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.మే 11నే వేలాది మంది భక్తులు యమునోత్రి ధామ్ కు తరలిరావడం విశేషం. యాత్రలో భాగంగా ఇరుకైన, ప్రమాదకరమైన మార్గాల్లో ప్రజలు చిక్కుకు పోయారు. ప్రజలు ముందుకు కదలలేక గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో గుర్రాల పైన, డోలీలోనూ యమునోత్రికి వెళ్లే భక్తులు. కాలినడక భక్తుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు, హోంగార్డులు లేకపోవడంతో తొలిరోజు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇబ్బంది పడుతున్న భారీ జనసందోహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత మరుసటి రోజు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులను పోలీసులు కోరారు. తొక్కిసలాట జరగకుండా అదనపు బలగాలను తరలిస్తున్నారు.
మే 10న ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర
0
355
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


