తిరుమలలో రేపు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదో తేదీన ఉగాది ఆస్థానం సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం నిర్వహించనున్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుం డటంతో వీఐపీ బ్రేక్ను టీటీడీ రద్దు చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటికే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను రద్దు చేసిన టీటీడీ… ప్రొటోకాల్ పరిధిలో స్వయంగా వచ్చే వీఐపీలకు, ట్రస్టు దాతల కు మాత్రమే బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో వీటిని కూడా రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది.
తిరుమలలో రేపు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ
0
252
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


