26.6 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

రోజుకో మలుపు తిరుగుతున్న కందుకూరు రాజకీయం

       ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి స్థానంలో వైసీపీ అభ్యర్థిగా మొదట కటారి అరవిందా యాదవ్‌ను సీఎం జగన్ నియమించారు. తరువాత ఆమె రాజకీయం పట్ల, కందుకూరు నియోజకవర్గం పట్ల ఆసక్తి చూపకపోవడంతో ఆ స్థానంలో బుర్ర మధుసూదన్‌ పేరు ప్రకటించింది. దీంతో మహీధర్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై టీడీపీ, వైసీపీ నేతలతో నియోజవకర్గ ప్రజలకు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. మహీధర్‌ రెడ్డి వైసీపీలో ఉంటారా ? లేక టీడీపీలో చేరుతారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పార్టీ మార్పు విషయంలో కందుకూరు YCP MLA మానుగుంట మహిధర్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. పలు దఫాలుగా అభిమానులతో పార్టీ మార్పుపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీకి చేరిన కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పటికే మానుగుంట మహిధర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్