సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలుకు డిమాండ్ చేస్తూ యువజన, విద్యార్థి జేఏసీ.. ఛలో సీఎం కార్యాలయం కు పిలుపు నిచ్చారు. జేఏసీ పిలుపుకు సిపిఐ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆందోళనలో రామ కృష్ణను పాల్గొనకుండా అడ్డుకునేందుకు గృహ నిర్బంధం చేశారు. ఆందోళన కారులు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. జేడీ లక్ష్మినారాయణ తోపాటు చలసాని శ్రీనివాస్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి జేఏసీ ఛలో సీఎం కార్యాలయం ఆందోళనకు అడుగడుగునా పోలీసుల అడ్డంకులు కల్పించారు.