32.6 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

వీడిన ఉత్కంఠ.. పల్లాకే జనగామ టికెట్

స్వతంత్ర వెబ్ డెస్క్:  జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఖాయమైందంటూ ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి రంగులు చల్లుకున్నారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ప్రభుత్వం ఆర్టీసీ చైర్మన్ పదవి ప్రకటించడంతో పల్లాకు లైన్ క్లియర్ అయింది. అయితే తన పదవిపై ఇప్పటివరకు ముత్తిరెడ్డి స్పందించలేదు. మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతుబంధు సమితి పదవి ఇవ్వగా… ఆయన సైతం మౌనంగానే ఉండిపోయారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసంతృప్తులపై భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న టికెట్లను ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే… తాటికొండ రాజయ్య మరియు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లకు కీలక పదవులు కట్టబెట్టారు సీఎం కేసీఆర్. మొన్నటి వరకు ప్రచారం జరిగినట్లుగానే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నియామకం చేశారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రైతుబంధు చైర్మన్ గా వల్ల రాజేశ్వర్ రెడ్డి పదవిని తాటికొండ రాజయ్యకు ఇచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్