23.2 C
Hyderabad
Tuesday, December 5, 2023
spot_img

వీడిన ఉత్కంఠ.. పల్లాకే జనగామ టికెట్

స్వతంత్ర వెబ్ డెస్క్:  జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఖాయమైందంటూ ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి రంగులు చల్లుకున్నారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ప్రభుత్వం ఆర్టీసీ చైర్మన్ పదవి ప్రకటించడంతో పల్లాకు లైన్ క్లియర్ అయింది. అయితే తన పదవిపై ఇప్పటివరకు ముత్తిరెడ్డి స్పందించలేదు. మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతుబంధు సమితి పదవి ఇవ్వగా… ఆయన సైతం మౌనంగానే ఉండిపోయారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసంతృప్తులపై భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న టికెట్లను ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే… తాటికొండ రాజయ్య మరియు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లకు కీలక పదవులు కట్టబెట్టారు సీఎం కేసీఆర్. మొన్నటి వరకు ప్రచారం జరిగినట్లుగానే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నియామకం చేశారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రైతుబంధు చైర్మన్ గా వల్ల రాజేశ్వర్ రెడ్డి పదవిని తాటికొండ రాజయ్యకు ఇచ్చారు.

Latest Articles

థియేటర్ నుంచి కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు: నితిన్

నితిన్‌ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్