స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రైతులకు బిగ్ అలెర్ట్. రైతుబీమాకు దరఖాస్తు చేసుకోడానికి నేడే చివరి తేదీ. దీనితో అర్హులైన రైతులు సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించి అప్లై చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 18లోపు పట్టా పాసు పుస్తకాలు పొందిన వారు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ని సంప్రదించి రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పేరిట భూమి పట్టా అయిన 18 నుంచి 59 ఏళ్ల వరకు వయసు గలవారు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రైతుబీమాకు దరఖాస్తు చేస్తున్న వారు ఏ కారణంగా చనిపోయినా రూ.5 లక్షల పరిహారంను ప్రభుత్వం అందిస్తుంది. ఈ మేరకు LICతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రైతు చనిపోయిన 10 నుంచి 20 రోజుల్లోనే ఈ సాయాన్ని రైతుకు చెక్కు రూపంలో అందజేస్తారు. కాగా చనిపోయిన వ్యక్తి పేరిట గుంట భూమి ఉన్నా కూడా ఈ సాయం అందనుంది. బాధిత కుటుంబానికి భరోసానిచ్చేలా ఈ సాయాన్ని సర్కార్ అందజేస్తుంది.