Revanth Reddy: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. ఇక సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల ప్రాణాలపైనా లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వర్షాలు ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్షలు జరపాల్సింది పోయి రాజకీయ అంశాలపై దృష్టి పెట్టారని రేవంత్ దుయ్యబట్టారు.

ఇక వర్షాలు కురిశాక చేపట్టాల్సిన సహాయక చర్యల్లో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. వరదలతో 30 మంది చనిపోయినా కూడా వారి కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని రేవంత్ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలపై కేసీఆర్ శ్రద్ధ లేదని ఎద్దేవా చేశారు. తాత్కాలిక సాయం కింద తెలంగాణకు రూ.1000 కోట్లను కేంద్రం రిలీజ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వరద సాయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉందన్నారు. హైదరాబాద్ లో చిన్న చినుకు పడితే చిత్తడిలా మారుతుందని..భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

 

Latest Articles

చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు

విజయవాడ రౌడీషీటర్‌ సాయికృష్ణ మిస్సింగ్‌ మిస్టరీలో అత్యంత వేగంగా పరిణామాలు మారుతున్నాయి. సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు వారికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్