30 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

Siddipeta: భారీ వర్షాలు.. ఈదుకుంటూ పాడేమోసిన బంధువులు

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానల కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వాగులు ఉప్పొంగడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆఖరి మజిలీ కోసం అవస్థలు పడిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం ఉప్పొంగుతున్న వాగులో పాడే మోస్తూ గ్రామస్థులు, బంధువులు ఈదుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ బాలయ్య అనే వ్యక్తి మృతిచెందారు. గ్రామస్థులు, బంధువులందరూ ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామంలో వాగు ఉప్పొంగుతోంది. అంత్యక్రియలు చేయాలంటే ఆ వాగు దాటాల్సి ఉంటుంది. ఇక దారిలేక స్మశాన వాటిక వాగు అవతలి వైపు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని వాగు దాటి అంత్యక్రియలు చేశారు. గతంలో బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మించాలని ఆ గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్