స్వతంత్ర, వెబ్ డెస్క్: బీజేపీ, వైసీపీది రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న బంధం మాత్రమేనని.. వాటిని రాజకీయాలతో ముడి పెట్టొద్దని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీని గౌరవించామని తెలిపారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసమే బీజేపీ కొత్త మాటలు మాట్లాడుతున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నిన్న అమిత్ షా సభ వేదికపై ఉన్న వాళ్లు తెలంగాణ బీజేపీ లీడర్లేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి దుర్వినియోగం అయ్యిందని నిరూపించగలరా? అంటూ ప్రశ్నించారు. అమరావతి పెద్ద స్కామ్ అని గతంలో బీజేపీ నేతలే చెప్పారని మండిపడ్డారు. పొత్తులు కోసం ఏ పార్టీ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు.. రాదు మంత్రి గుడివాడ ఘాటు వ్యాఖ్యలు చేశారు.