స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని మరో 9 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు మరింత సమయం లేనందున అందరూ శ్రమించాలని.. ఇప్పుడు శ్రమిస్తే మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరంలేదని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ముందస్తు ఎన్నికలపై మళ్లీ క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
0
399
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


