రైలు ప్రమాద బాధ్యులను గుర్తించాం: రైల్వే మంత్రి

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనకు గల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమిక అంచనాకు వచ్చామని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని ఆయన వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని కనిపెట్టడంతో పాటు బాధ్యులను కూడా గుర్తించామన్నారు. పూర్తి నివేదిక ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతానికి తమ దృష్టి అంతా పునరుద్ధరణ చర్యలపైనే ఉందన్నారు. రైళ్ల రాకపోకలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే తమ ముందున్న కర్తవ్యమని వివరించారు. పట్టాలపై పడి ఉన్న మృతదేహాలన్నింటినీ తొలగించినట్లు తెలిపారు. కాగా బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది దుర్మరణం చెందగా.. 1,175 మందికి పైగా గాయాలయ్యాయి.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్