స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. మెదక్ జిల్లా గాంధీ నగర్ లో సమీర్ అనే వ్యక్తి 133 కేవీ విద్యుత్ టవర్ ని చిట్టచివరికి వరకు ఎక్కాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే టవర్ వద్దకు చేరుకొని ఆ యువకుడిని కిందికి దించే ప్రయత్నం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు మద్యం తాగి టవర్ ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే కేవలం మద్యం తాగే టవర్ ఎక్కడా? లేక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సమీర్ మెదక్ లోని ఓ బేకరీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి.. చివరికి నచ్చజెప్పి అతి కష్టం మీద కిందకు దించారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది.
సెల్ టవర్ చిట్టచివరికి ఎక్కి యువకుడు హల్చల్
0
408
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


