స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీ నుంచి సిడ్నీ బయలుదేరిన ఎయిర్ఇండియాకి చెందిన B787-800 విమానం గాల్లో ఉండగానే భారీ కుదుపులకు గురైంది. దీంతో అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు వైద్యాదికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. ఈ మేరకు విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందిస్తూ.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయానికి చేరుకోగానే ప్రయాణికులకు వైద్య సహాయం అందించినట్లు తెలిపింది. ఈ ఘటన మే 16 (మంగళవారం) జరగగా దీనికి సంబంధించిన వివరాలను డీజీసీఏ బుధవారం వెల్లడించింది.


