స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ప్రస్తుతం పుత్రోత్సాహం అనుభవిస్తున్నారు. ఆయన తనయుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. అమెరికాలో జరిగిన ఈ స్నాతకోత్సవం కార్యక్రమానికి హరీశ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అర్చిష్మాన్ గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్ మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో హరీశ్ రావు తన కుమారుడిని చూసి ఆనందంతో పొంగిపోయారు. మా అబ్బాయి సాధించిన అద్భుతమైన ఘనత పట్ల తండ్రిగా గర్వించకుండా ఎలా ఉండగలను అంటూ ట్వీట్ చేశారు. ఈ అమోఘమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా తనకు అభినందనలు చెబుతానని పేర్కొన్నారు.
తనయుడు ఇంజనీరింగ్ పట్టా అందుకోవడంపై హరీశ్ రావు సంతోషం
0
390
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


