యువగళం పాదయాత్రలో జనసైనికులు.. లోకేశ్‌కు సంఘీభావం

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన, యువగళం జెండాలతో పాదయాత్రకు జనసైనికులు సంఘీభావం తెలిపారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగించిన లోకేశ్ జనసైనికులకు అభివాదం చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై విమర్శలు చేశారు. తాను ఎస్సీలను అవమానించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని.. నిరూపించలేకపోతే భారతీ రెడ్డి తన ఛానెల్‌, పత్రిక మూసేస్తారా? అంటూ లోకేశ్ సవాల్ విసిరారు. ఆ మీడియా సంస్థ చూపిస్తున్న వీడియోలో జనం చప్పట్లు కొడుతున్నారని.. ఎస్సీల సభలో ఎస్సీలను అవమానిస్తే చప్పట్లు కొడతారా? అని ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్‌ భారతీరెడ్డి ఎలా మిస్‌ అయ్యారని ప్రశ్నించారు.

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్