25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

యువగళం పాదయాత్రలో జనసైనికులు.. లోకేశ్‌కు సంఘీభావం

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన, యువగళం జెండాలతో పాదయాత్రకు జనసైనికులు సంఘీభావం తెలిపారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగించిన లోకేశ్ జనసైనికులకు అభివాదం చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై విమర్శలు చేశారు. తాను ఎస్సీలను అవమానించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని.. నిరూపించలేకపోతే భారతీ రెడ్డి తన ఛానెల్‌, పత్రిక మూసేస్తారా? అంటూ లోకేశ్ సవాల్ విసిరారు. ఆ మీడియా సంస్థ చూపిస్తున్న వీడియోలో జనం చప్పట్లు కొడుతున్నారని.. ఎస్సీల సభలో ఎస్సీలను అవమానిస్తే చప్పట్లు కొడతారా? అని ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్‌ భారతీరెడ్డి ఎలా మిస్‌ అయ్యారని ప్రశ్నించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్