ఆదివారం సెలవు కదా అని సరదాగా కుటుంబం, స్నేహితులతో సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్ సిబ్బంది చిరాకు తెప్పించింది. హైదరాబాద్ మూసాపేటలో ఉన్న ఏషియన్ లక్ష్మీకళ థియేటర్లో సాయితేజ్ ‘విరూపాక్ష’ సినిమా ప్రదర్శితం అవుతోంది. అయితే మూవీ చూద్దామని సాయంత్రం 6గంటల షోకు వెళ్లగా.. 7.30గంటల వరకు సిబ్బంది సినిమా ప్రదర్శించలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆడియన్స్ థియేటర్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రేక్షకులను అదుపు చేశారు. అసౌకర్యానికి చింతిస్తూ టికెట్లు కొనుగోలు చేసిన వారికి థియేటర్ యాజమాన్యం తిరిగి డబ్బులు చెల్లించింది.
షో ఆలస్యం కావడంతో థియేటర్ ఫర్నిచర్ ధ్వంసం
0
332
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


