జూన్ 11లోపు రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని MRPS అధ్యక్షుడు మందకృష్ణ డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి సర్కార్ ఓట్లకోసమే అణగారిన వర్గాలను నమ్మించిందన్నారు. ఆరు నెలలైనా కాంగ్రెస్ సర్కార్ రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. కులగణన చేపట్టి బీసీలకు 50శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఎస్సి, ఎస్టీ బీసీ జనాభా 80శాతం దాటింద న్నారు. కులగనణ పేరుతో కామారెడ్డిలో డిక్ల రేషన్ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆర్డర్ ద్వారా రిజర్వే షన్ అమలు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. జూన్ 11వ తేదీ లోపు లెక్క తెల్చకపోతే యుద్ధం ప్రారంభిస్తామని మండకృష్ణ హెచ్చరించారు.