స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేవదేవున్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 36 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. గురువారం స్వామివారిని 74,583 మంది భక్తులు దర్శించుకోగా 40,343 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, స్వామివారికి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.