భారత నావికాదళానికి చెందిన యూద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన నౌకలో సిబ్బందిగా ఉన్న 19 మంది పాక్ పౌరులను రక్షించింది. భారత నౌకాదళానికి చెందిన ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర సోమాలియా, గల్ఫ్ ఆఫ్ అడెన్ తూర్పున యాంటీ పైరసీ, మారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కోసం మోహరించింది. జనవరి 28న ఇరాన్కు చెందిన మత్స్యకారుల నౌక ఇమాన్ ను సముద్రపు దొంగలు, హైజాక్ చేయగా ఐఎన్ఎస్ సుమిత్ర అడ్డుకుని ఆ నౌకలోని 17 ఇరానియన్ జాతీయులను సురక్షితంగా విడిపించింది. ఎఫ్వీ ఇమాన్ ను హైజాక్ చేసిన 11 సోమాలి సముద్రపు దొంగలను పట్టి బంధించింది. ఫిషింగ్ నౌక అల్ నయీమీని, ఆ నౌకలో సిబ్బంది గా పనిచేస్తున్న 19 మంది పాకిస్థానీ జాతీయులను రక్షించింది.