వైసీపీ గాలికి ఎదురీది గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే రామరాజు నెక్ట్స్ సీన్ ఏంటి?

      ఉండి నుంచి ఎమ్మెల్యేగా ఆయన 2019 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ, లాభం లేకపోయింది. అదేమంటే ప్రభుత్వం మాత్రం మారిపోయింది. రాష్ట్రంలో వైసీపీ సర్కారు రావడంతో ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయిందని స్థానికులే కాదు.. చివరకు ఎమ్మెల్యే సైతం అదే మాట చెబుతు న్నారు. అసలు ఎందుకీ పరిస్థితి తలెత్తింది ? మరి…ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే. .రానున్న ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే సంగతేమిటి ? ఇలా ఒకటీ రెండూ కాదు.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సందేహాలు. ఇంతకీ ఆ నియోజకవర్గం.. ఆ ఎమ్మెల్యే ఎవరు అంటారా..! చెప్పడం ఎందుకు లెట్స్ వాచ్ ది స్టోరీ.

      ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈ నియోజకవర్గం గురించే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గా ల్లో ఉండి ఒకటి. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి 2019 ఎన్నికల్లో ఎంతో బలంగా వీచింది. అయినా జగన్‌ వేవ్‌ను తట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలుచుకోగా.. అందులో ఒకటి ఉండి ఎమ్మెల్యే సీటు. అసెంబ్లీ ఎన్నికలు అన్న తర్వాత పార్టీలే కాదు.. ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు సైతం ఎన్నో హామీలు గుప్పిస్తుం టారు. అలాగే…మంతెన రామరాజు సైతం నియోజకవర్గం అభివృద్ధి కోసం పలు హామీలిచ్చి తిరుగులేని విజయం సాధించారు. కానీ, ఆ తర్వాతే పరిస్థితి మారిపోయింది. 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది వైసీపీ. ఇక్కడే ఎమ్మెల్యేకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతిపక్షఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం నుంచి కావాల్సినన్ని నిధులు విడుదల కాలేదని.. సహాయ సహకారాలు అందలేదని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే.

       నియోజకవర్గంలో పూర్తికాని పనుల విషయానికి వస్తే.. కాళ్లలో వంతెన నిర్మాణానికి కేంద్రం నుంచి రెండు సార్లు నిధులు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా అందించకపోవడంతో అవి కాస్తా వెనక్కు వెళ్లిపోయాయాని వాపోయారు ఎమ్మెల్యే రామరాజు. ఇక, నియోజక వర్గంలో మేజర్ పంచాయతీ అయిన ఆకివీడు ఇప్పుడు నగర పంచాయతీ అయింది. దీంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావించారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. పేరుకు నగర పంచాయతీ అయినా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడంతో దోమల సమస్య ఎక్కువైంది. దీనికితోడు డంపింగ్ యార్డ్ విషయంలోనూ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శలున్నాయి. ఈ నియోజకవర్గం ఆక్వా రంగానికి కేరాఫ్‌గా ఉండడంతో మంచినీరు లభ్యత పెను సవాలుగా మారింది. పంచాయతీల కు నిధుల లేమి కారణంగా కనీసం వీధి దీపాలు కూడా వేయించలేని దుస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. ఇక, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య శ్రీ,, మద్య నియంత్రణ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అమ్మఒడి, ఫించన్ల కానుక, వైఎస్సార్ చేయూత, ఆసరాలు ఫలాలు పూర్తిస్థాయిలో ఈ నియోజకవర్గంలో అందడం లేదన్న విమర్శలున్నాయి.

        ఇవన్నీ ఒక ఎత్తైతే నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్న వాదన బలంగా విన్పిస్తోంది. అయితే.. వైసీపీ నుంచి గెలిచినా ఆ పార్టీతో పొసగక ధిక్కార స్వరం విన్పిస్తున్న నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు అందించిన నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 70 గ్రామాలలో చిన్నచిన్న పనులు, సౌక ర్యాలు కల్పించారు మంతెన రామరాజు. అయితే.. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ జనసేన నేతృత్వం లోని ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఉండి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేయడంతోపాటు ఆదర్శవంతంగా తీర్చిదిద్దు తానని చెబుతున్నారు ఎమ్మెల్యే మంతెన రామరాజు. మరి… ప్రజలు ఎలా స్పందింస్తారు ? ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తా రన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్