రాజకీయాల్లో చంద్రబాబు అంత నిజాయితీపరుడైతే ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి ఎందుకు కొన్నారని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. మోహన్బాబు నుంచి హెరిటేజ్ ఎందుకు లాక్కున్నారని ఆయన నిలదీశారు. చంద్రబాబు, ప్రతి పక్ష నేత గురించి పబ్లిక్ డొమైన్లో కొన్ని విషయాలు ఉన్నాయని, నార్కో టెస్టులో పాసై బయటకు రావాలంటూ సవాల్ విసిరారు. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్ర బాబు కాదా అని ఆయన నిలదీశారు. మరోవైపు, కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలా అనడం వ్యభి చారంతో సమానమంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన పని కాపుల ను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఏపీలోని ఆడబిడ్డలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుపై పోసాని ఫైర్
0
556
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


