స్వతంత్ర వెబ్ డెస్క్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన త్వరలోనే తిరిగి తన సొంత గూడైన కాంగ్రెస్లోకి చేరనున్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించే సత్తా ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెస్కే ఎక్కువగా ఉన్నందున ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరుతున్నట్లు తాను విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంపై ఆయన సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకే కాంగ్రెస్లో చాలా మంది నేతలు చేరుతున్నారని అన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరడం గురించి తనతో మాట్లాడలేదని చెప్పారు. డైరెక్టుగా ఆ విషయం అధిష్ఠానంతో మాట్లాడాడని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాకుండా చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి వస్తున్నారని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్లో చేరిక గురించి నా సోదరుడు నాతో మాట్లాడలేదు- కోమటిరెడ్డి
0
691
Latest Articles
అల్వాల్లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్ సీజ్
అల్వాల్లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -
- Advertisement -


