మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జలసౌధలోని ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను ఆధీనంలోకి తీసుకు న్నారు పోలీసులు. అధికారులు, సిబ్బంది ఫ్లోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అన్ని ఫైల్స్, రికార్డులను పరిశీలిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలోనూ విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్లకుసంబంధించిన కార్యాలయాల్లో విలువైన పత్రాలను పరిశీలిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేపట్టిన పను లపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. మరో వైపు… హైకోర్టు సీజేకి ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డ జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని ప్రభుత్వం కోరింది.