ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఆళ్లగడ్డలో రా కదలి రా బహిరంగ సభలో చంద్ర బాబు పాల్గొన్నారు. అయితే, ఆళ్లగడ్డ సభకు టీడీపీ సీనియర్ నేత ఏ. వి. సుబ్బారెడ్డి రాకూడదని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వర్గం అంటోంది. ఏవి వస్తే వేదికపైకి పిలిచేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. చంద్రబాబు సభ సాక్షిగా టీడీపీలో విభేదాలు బయటపడనుండడంతో ముందుగానే అలర్ట్ అయ్యింది అధిష్టానం. ఏవి సుబ్బారెడ్డి తో మాట్లాడి ఆయనకు నచ్చచెప్పింది. నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డిని మాజీ మంత్రి ఫరూక్ కార్యాలయంలో ఆయన సమక్షంలో చంద్రబాబు సభ పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి చర్చలు జరిపారు. అళ్ళగడ్డలోని పరిస్థితులను ఏవికి చౌదరి వివరించారు.చంద్రబాబు సభ విజయవంతం కావాలని చెప్పారు. పార్టీ కోసం సభకు రానని చెప్పిన ఏవి సుబ్బారెడ్డి, సభను విజవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.
భూమా, ఏవీ మధ్యలో చంద్రబాబు
0
357
Previous article
Next article
Latest Articles
చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు....
- Advertisement -
- Advertisement -


