పాక్ ఎన్నికల ఫలితాల విడుదల్లో చాలా జాప్యం చోటు చేసుకుంది. ఫలితాలు విడుదలైన క్రమంలో ఇమ్రాన్ , నవాజ్ షరీఫ్ ల్లో ఎవరికీ స్పష్టమైన విజయం చేకూరని పరిస్థితి నెలకొంది. దీంతో పాక్ లో రాజకీయ అనిశ్చితికి తెరతీశాయి. ఒక వైపు జైల్లో ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు 101 స్థానాల్లో విజయం సాధించారు. అయినా వారంతా ఇండిపెండెంట్లుగా ఉడడం చేత కనీస మెజారిటీ రాలేదు. ఇదిలా ఉంటే నవాజ్షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్–నవాజ్ , బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. పీఎంఎల్–ఎన్ 75 సీట్లతో దిగువసభలో అతిపెద్ద పార్టీగా తన స్థానాన్ని నిలుపుకుంది. పీపీపీ 54 సీట్లు, ఇతర చిన్న పార్టీలు మొత్తం కలిసి 34 సీట్లు సాధించుకు న్నాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ దిగువ సభలో 265 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే వాటిలో 40 స్థానాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఒక నియోజకవర్గం ఫలితాన్ని మాత్రమే పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ నిలిపి వేసింది. మిగిలిన 264 స్థానాల ఫలితాలను ప్రకటించింది. పాక్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 133 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంది.
పాక్ దిగువసభలో మొత్తం 336 స్థానాలకు 70 స్థానాల్లో మహిళలను, మతపరమైన మైనారిటీలను నామినేట్ చేస్తారు. ఈ నామినేటెడ్ స్థానాలను పార్టీలు తమ ఎంపీల సంఖ్యాబలం ఆధారంగా గెల్చుకుంటాయి. అత్యధికసంఖ్య లో ఎంపీలు ఉన్న పార్టీకే అత్యధిక నామినేటెడ్ ఎంపీ పదవులు కూడా దక్కుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కు.. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 265 స్థానాల ఫలితాలే కీలకం మారతాయి. ఎన్నికల ఫలితాలను ప్రజా తీర్పుగా గౌరవిం చాలని, తమ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని పీటీఐ ఒక వైపు డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి అది సాధ్యమయ్యే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారం టూ ఫిర్యాదులు రావడంతో పీటీఐ ఎన్నికల గుర్తు ‘క్రికెట్ బ్యాట్’ ఆ పార్టీ అభ్యర్థులు వినియోగించ కూడదని, సుప్రీంకోర్టు ఆదేశించిం ది. దీంతో ఆ పార్టీ మద్దతు దారులంతా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారు. మళ్లీ వీరంతా పీటీఐలో చేరాలం టే అదే పార్టీలో అంతర్గతంగా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఎన్నికల గుర్తును పొందాల్సి ఉంటుంది.
దీంతో పీపీపీ, ఇతర చిన్నపార్టీల కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పీఎంఎల్–ఎన్ నేత నవాజ్ షరీఫ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎంఎల్–ఎన్, పీపీపీల మధ్య చర్చలు జరిగాయి. అయితే, తనకు ప్రధాని పదవి ఇవ్వాలని పీపీపీ చైర్మన్, బిలావల్ భుట్టో డిమాండ్ చేస్తున్నారు. దీనికి పీఎంఎల్–ఎన్ అంగీకరించలేదు. ఇదిలా ఉంటే పీటీఐ మద్దతుతో ఎన్నికల్లో గెలిచిన ఓ ఇండిపెండెంట్ పీఎంఎల్–ఎన్లో చేరారు. ఈ సందిగ్దత ఇలాగే కొనసాగితే ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇదే బాట పట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకు భావిస్తున్నారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ పొత్తు ప్రయత్నాలను పీటీఐ తీవ్రంగా విమర్శించింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, పాలనాపరమైన పలు సంక్షోభాలు కలగడానికి, గతంలో ఈ పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం ప్రధాన కారణమని, అందేకాదు వాళ్లంతా నేరస్తులని విమర్శించింది. అధిక సీట్లు సాధించిన తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.