దరిగాం అటవీ ప్రాంతంలో టైగర్‌ ఆపరేషన్‌ సక్సెస్‌

       కొమురం భీం జిల్లా అడవిలో టైగర్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. ట్రాప్ కెమెరాకు పులి చిక్కడంతో సక్సెస్‎గా ముగి సింది. ఈ ఆపరేషన్‎తో దరిగాం అటవీ ప్రాంతం జీవ వైవిద్యానికి కేరాప్ అడ్రస్‎గా.. పులుల ఆవాసానికి అడ్డాగా మారిం దని తేలడంతో ఆ పరిధిలోని అటవీ సిబ్బంది బాధ్యతను రెట్టింపు చేసినట్టైంది. మూడు రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా అణువణువు గాలించిన ట్రాకింగ్ టీం టైగర్ జిందా హై అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

      ఈనెల 10 న కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో మరో పశువుపై పులి దాడి చేయడంతో అప్రమత్తమైంది అటవీశాఖ. ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరా ఏర్పాటు చేయడంతో.. ఓ కెమెరాకు పులి చిక్కిం ది. ఆ పులి పాదముద్రల ఆధారంగా ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. అడవి మొత్తం జల్లెడ పడుతోంది ఆ పులి కోసమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్‎లో ఒక్క ఎస్ 6 మాత్రమే కాదు.. రెండు పులుల మరణాల తర్వాత కనిపించకుండా పోయిన 16 నెలలున్న మరో పిల్ల పులితో పాటు ఎస్ 6 సంతతికి చెందిన కే 14, 17 పులులు సైతం క్షేమంగా ఉండటంతో మూడు రోజుల పాటు దరిగాం అటవీ ప్రాంతంలో సాగిన సెర్చ్ ఆపరేషన్‎కు ఫలితం దక్కినట్టైంది.

Latest Articles

బండి భగీరథ్‌ను అరెస్టు చేశాము.. సరెండర్‌ అవ్వలేదు- రేవంత్‌ రెడ్డి

బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని.. సరెండర్‌ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్‌ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్