కొమురం భీం జిల్లా అడవిలో టైగర్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ట్రాప్ కెమెరాకు పులి చిక్కడంతో సక్సెస్గా ముగి సింది. ఈ ఆపరేషన్తో దరిగాం అటవీ ప్రాంతం జీవ వైవిద్యానికి కేరాప్ అడ్రస్గా.. పులుల ఆవాసానికి అడ్డాగా మారిం దని తేలడంతో ఆ పరిధిలోని అటవీ సిబ్బంది బాధ్యతను రెట్టింపు చేసినట్టైంది. మూడు రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా అణువణువు గాలించిన ట్రాకింగ్ టీం టైగర్ జిందా హై అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 10 న కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో మరో పశువుపై పులి దాడి చేయడంతో అప్రమత్తమైంది అటవీశాఖ. ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరా ఏర్పాటు చేయడంతో.. ఓ కెమెరాకు పులి చిక్కిం ది. ఆ పులి పాదముద్రల ఆధారంగా ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. అడవి మొత్తం జల్లెడ పడుతోంది ఆ పులి కోసమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్లో ఒక్క ఎస్ 6 మాత్రమే కాదు.. రెండు పులుల మరణాల తర్వాత కనిపించకుండా పోయిన 16 నెలలున్న మరో పిల్ల పులితో పాటు ఎస్ 6 సంతతికి చెందిన కే 14, 17 పులులు సైతం క్షేమంగా ఉండటంతో మూడు రోజుల పాటు దరిగాం అటవీ ప్రాంతంలో సాగిన సెర్చ్ ఆపరేషన్కు ఫలితం దక్కినట్టైంది.