భారత్ తరపున క్రికెట్లో అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించిన ఉత్తమ ప్లేయర్స్ కి బీసీసీఐ ఈరోజు అవార్డులను ఇవ్వనుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత బీసీసీఐ ఈ అవార్డ్స్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తుంది. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ జరిగే ఈ ఈవెంట్కి భారత స్టార్ ప్లేయర్లు, బీసీసీఐ సభ్యులు, టీమ్ ఇండియా కోచ్లు ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఇక 2023 సంవత్సరంలో 5 సెంచరీలు, 2 వేల రన్స్ చేసిన స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ కు 2023 మెన్స్ విభాగంలో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అందుకోనున్నాడు . మాజీ టీమ్ ఇండియా కోచ్ శాస్త్రి సేవలకు గాను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును బీసీసీఐ ఇవ్వనుంది.